Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ - సెహ్వాగ్ రికార్డును బద్ధలుకొట్టిన శర్మ - ధవాన్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (16:20 IST)
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ - శిఖర్ ధావన్‌లు సరికొత్త రికార్డును నెలకొల్పారు. కొన్ని రోజులుగా పెద్ద భాగస్వామ్యాలు ఏవీ నెలకొల్పని ఈ జోడీ.. నాలుగో వన్డేలో సెంచరీ భాగస్వామ్యాలను అందుకుంది. రోహిత్, ధావన్‌లకు ఇది 15వ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం. అంతేకాదు ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఈ జోడీ వెయ్యి పరుగులు చేసింది. 
 
ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్ రికార్డును కూడా రోహిత్, ధావన్ జోడి అధికమించారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకు 4,387 పరుగులు చేశారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికీ సచిన్, గంగూలీ జోడీయే టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ జోడీ 176 ఇన్నింగ్స్‌లో 8,227 పరుగులు చేసింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తం 92 బంతులను ఎదుర్కొన్న రోహిత్ రెండు సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 103.26 స్ట్రైక్‌తో 95 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవాన్ మాత్రం సెంచరీతో వీరవిహారం చేశాడు. 
 
ధావన్ 115 బంతులను ఎదుర్కొన్న ధవాన్... 3 సిక్స్‌లతో, 18 ఫోర్ల సాయంతో 124.34 స్ట్రైక్‌ రేటుతో 143 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 193 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

తర్వాతి కథనం
Show comments