Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ, రోహిత్‌శర్మల మధ్య విభేదాలు.. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అన్‌ఫాలో...

Webdunia
శనివారం, 27 జులై 2019 (16:23 IST)
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మల విభేదాలు తలెత్తాయనే వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో సెమీస్‌ ఓటమి తర్వాత కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల మధ్య వివాదం మొదలైందని వార్తలు వచ్చాయి. విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లి భావించాడని.. కానీ రోహిత్‌కి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేకే మళ్లీ మనసు మార్చుకున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. 
 
ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలున్నాయనే అంశంపై నెటిజన్లు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. కోహ్లీ, ఆయన భార్య అనుష్కశర్మలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అన్‌ఫాలో అయ్యారని సమాచారం. దీంతో కోహ్లీతో విబేధాలు నిజమేనని తెలుస్తోంది.
 
అయితే జట్టు కూర్పు, వ్యూహాల విషయంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వినిపిస్తారు. ఈ విషయమై వాదనలు, చర్చలు నడుస్తాయి. కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు, సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. కోహ్లి, రోహిత్ సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేం లేదని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments