Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జెర్సీ రంగు మారుతోంది... సింహభాగం కాషాయం రంగులోకి...

ఠాగూర్
మంగళవారం, 7 మే 2024 (10:26 IST)
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వు బెంచ్ కోసం ఎంపిక చేసింది. అయితే, ఈ టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించనున్నట్టు తెలుస్తుంది. 
 
ఈ మేరకు బీసీసీఐ నూతన జెర్సీల ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేయగా, వాటిని క్రికెట్ అభిమానులు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ రంగులో ఈ జెర్సీ ఉంది. ఇదే రకం జెర్సీని టీమిండియా ఆటగాళ్ళు 2019 వరల్డ్ కప్ సమయంలోనూ ధరించారు. ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేటపుడు టీమిండియా వేర్వేరు జెర్సీ ధరిస్తూ వస్తుంది. మరి ఈసారైనా కొత్త జెర్సీ లక్ తెలుస్తుందేమో చూడాలి. 2011 తర్వాత టీమిండియా ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ నెగ్గలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments