Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు దీపావళి వేడుకలు... అనుష్కతో కలిసి పాల్గొన్న కోహ్లీ

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (12:31 IST)
దేశ ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను కూడా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు కూడా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భారత క్రికెటర్లందరూ పాల్గొన్నారు. ఇందులో తన భార్యతో కలిసి విరాట్ కోహ్లీ పాల్గొని సందడి చేశారు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. క్రికెటర్లందరూ సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు.
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు బెంగుళూరులో ఓ నక్షత్ర హోటల్‌లో బసచేసివుంది. ఆ హోటల్‌లోనే భారత క్రికెటర్లు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
 
లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదికకానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగుళూరుకు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్‌లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర జట్టు సభ్యులు, జట్టు మేనేజ్‌మెంట్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments