Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తర

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (10:12 IST)
కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై వస్తున్న విమర్శల సందర్భంగా సెహ్వాగ్ స్పందించాడు. 
 
ధోనీకి విలువైన సలహా ఇచ్చాడు. వన్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. ఇది ధోనీకి తెలియని విషయమేమ కాదంటూనే.. మిడిలార్డర్‌లో వచ్చే ధోనీ.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. ఈ ప్రయత్నంలో అవుటైపోయినా పర్లేదు కానీ, క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటం సరికాదన్నాడు. 
 
ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే ఆ ప్రభావం జట్టు మీద పడుతుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments