Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్‌ను ప్రధానమంత్రిని చేయాలంటున్న నెటిజన్లు.. ఎందుకు?

భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను దేశ ప్రధానమంత్రిని చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వారు అలా డిమాండ్ చేయడం వెనుక ఓ బలమైన కారణం లేకపోల

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (14:11 IST)
భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను దేశ ప్రధానమంత్రిని చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వారు అలా డిమాండ్ చేయడం వెనుక ఓ బలమైన కారణం లేకపోలేదు. 
 
రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న అండర్ 19 జట్టు ఇటీవల ప్రపంచ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. దీంతో జట్టుతో పాటు.. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ మొత్తంలో నజరానా ప్రకటించింది. ఇందులో కోచ్‌కు రూ.50 లక్షలు, టీమ్ సభ్యులకు రూ.30 లక్షలు, కోచింగ్ స్టాఫ్‌కు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
 
దీనిపై ద్రావిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. అందరూ సమానంగా కష్టపడితేనే వరల్డ్‌కప్ సాధ్యమైందని, అలాంటిది ఒక్కొక్కరికీ ఒక్కో నజరానా ఎందుకని బోర్డును బహిరంగంగా ప్రశ్నిస్తూ, అందరికీ సమంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌కు బీసీసీఐ తల వంచింది. కోచ్ ద్రావిడ్‌కు ఇచ్చిన రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో రూ.25 లక్షలు కోతవిధించి... మిగిలిన సభ్యులకు కూడా రూ.25 లక్షల చొప్పున నజరానా ఇచ్చింది. 
 
ఇది చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అసలు ఇలాంటి వాడే కదా మనకు కావాల్సింది అంటూ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించారు. పక్కవాళ్ల బాగోగుల గురించి ఆలోచించే ద్రవిడ్.. నిజమైన లెజెండ్ అని కొనియాడారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ మొదట ప్ర‌ధాన‌మంత్రిని చేయాల‌ని ప్ర‌తిపాదించ‌గా.. మిగిలిన నెటిజన్లంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

తర్వాతి కథనం
Show comments