Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదమెక్కిన మగాళ్లు లైంగికదాడి చేస్తుంటే.. పిరికిపందల్లా చూసిన వాళ్లు పురుషులా? ఛీ...: విరాట్ కోహ్లీ

బెంగుళూరులో సామూహిక లైంగిక వేధింపుల ఘటనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదమెక్కిన మృగాళ్లు మహిళలపై దాడులకు పాల్పడుతుంటే పిరికిపందల్లా చూసిన వాళ్లకి.. మగాళ్లని

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (12:48 IST)
బెంగుళూరులో సామూహిక లైంగిక వేధింపుల ఘటనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదమెక్కిన మృగాళ్లు మహిళలపై దాడులకు పాల్పడుతుంటే పిరికిపందల్లా చూసిన వాళ్లకి.. మగాళ్లని చెప్పుకునే హక్కులేదని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇలాంటి సమాజంలో తానూ ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్టు వ్యాఖ్యానించాడు. 
 
డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన ఘటనపై కోహ్లీ ఆలస్యంగా స్పందించాడు. ఇదే అంశంపై అతను ఓ ట్వీట్ చేశాడు. 'బెంగళూరులో జరిగిన ఘటనలు ఎంతో కలచి వేశాయి. ఓ అమ్మాయిపై దాడి జరుగుతుంటే.. ప్రేక్షకుల్లా చూడటం పిరికిపంద చర్య. అసలు వాళ్లకు మగాళ్లని చెప్పుకునే హక్కులేద’ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సందేశంలో విరాట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మీ కుటుంబంలోని వారిపై ఇలాంటి అఘాయిత్యానికి బరితెగిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని సూటిగా ప్రశ్నించాడు. అడ్డుకునే వారు లేరనే ధైర్యంతోనే అరాచక మూకలు పేట్రేగి పోతున్నాయని కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కురచ దుస్తులు ధరించిన కారణంగానే ఇదంతానా..! ఆమె జీవితం.. ఆమె ఇష్టం. పురుషులు దానిని ఒప్పుకోవాలి. కానీ అధికారంలో ఉన్న వారి వ్యాఖ్యలు భయానకమ’ని కోహ్లీ అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

తర్వాతి కథనం