Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ..

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:56 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ... జట్టు సభ్యులకు హెడ్ మసాజ్ చేస్తూ బిజీ అయిపోయాడు. 
 
సౌతాఫ్రికా పర్యటనను కోహ్లీ సేన విజయవంతంగా ముగించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయభేరీ మోగించింది. ఈ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా టీమ్‌ను ముందుండి నడిపించాడు. 
 
కానీ, మోకాలికి గాయం కారణంగా చివరి టీ20కి దూరమయ్యాడు. అయితే ఖాళీగా ఉండటం ఎందుకని.. ఈ మ్యాచ్‌లోనూ ఫిజియో పని చేశాడతడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఫీల్డ్ లోపల, బయట కోహ్లి, ధావన్ మధ్య మంచి కెమెస్ట్రీ ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

తర్వాతి కథనం
Show comments