Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఖండే స్టేడియంలోని సీటుకు ఎంఎస్ ధోనీ పేరు..

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (18:27 IST)
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వాంఖడే స్టేడియం వేదికపై 12 సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం ఎంఎస్ ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 50 ఓవర్ల ప్రపంచకప్‌ కోసం భారత్‌ 28 ఏళ్ల నిరీక్షణకు ధోనీతో తెరపడిన సంగతి తెలిసిందే. 
 
ఎంసీఏ పెవిలియన్‌లో ఆరుగురు దిగిన స్థలాన్ని గుర్తించామని.. ఆ ప్రాంతానికి అతి త్వరలో శాశ్వతంగా ఎంఎస్ ధోని పేరు పెట్టనుంది. రాష్ట్ర బోర్డు ప్రారంభోత్సవానికి 41 ఏళ్ల క్రికెటర్‌ను కూడా ఆహ్వానించిందని, అతనికి జ్ఞాపికను అందజేయాలని ఎంసీఏ యోచిస్తోంది.  
 
కాగా.. శ్రీలంకతో ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్‌.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్‌ అమోల్‌ ఖేల్‌ వెల్లడించారు.

వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్‌, గవాస్కర్‌, విజయ్ మర్చంట్‌ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వినూత్నంగా సీటుకు ధోని పేరు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunita Williams: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

cock fight: 10 నిమిషాల్లో యజమానికి కోటి రూపాయలు తెచ్చిన కోడిపుంజు

sankranti cock fight: మౌనంగా నిలబడి గెలిచిన కోడిపుంజు

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఈటల రాజేందర్ (Video)

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ : 11 మంది ఎన్‌కౌంటర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

తర్వాతి కథనం
Show comments