Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ కోహ్లీ సేనదే అంటున్న మాస్టర్ బ్లాస్టర్

Webdunia
శనివారం, 4 మే 2019 (13:01 IST)
ఈనెలాఖరులో ఐసీసీ ప్రపంచ కప్ 2019 మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. అయితే, ఈ దఫా వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లే ఫేవరేట్ అంటూ పలువురు క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. కానీ, భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం మరోలా ఊహిస్తున్నారు. ఈ దఫా భారత్ ఖాతాలో వరల్డ్ కప్ చేరుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. 
 
ఆయన శనివారం ముంబైలోని ఎంఐజీ మైదానంలో సచిన్ పేరుతో పెవిలియన్ ఎండ్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ పూర్తిగా మండుటెండలో జరుగనున్నాయి. ఎండల ప్రభావానికి పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సౌకర్యంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. పైగా ఇంగ్లండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. ఈ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో భారీ మార్పులు జరిగితే తప్ప పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. 
 
మరోవైపు భారత బ్యాట్స్‌మెన్ అంద రూ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే పరిణామంగా చెప్పొచ్చు. కెప్టెన్ కోహ్లి, రోహిత్, ధావన్, రాహుల్, హార్దిక్, ధోనీ వంటివారితో భారత బ్యాటింగ్ బలీయంగా ఉంది. అంతేగాక వీరంతా ఐపీఎల్‌లో నిలకడగా రాణించడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఇక, బుమ్రా, భువనేశ్వర్, చాహెల్, కుల్దీప్, జడేజా తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. దీనికితోడు ఇంగ్లండ్ పిచ్‌లపై భారత్ మంచి అవగాహన కూడా ఉంది. దీంతో ప్రపంచకప్‌ను గెలవడం భారత్‌కు కష్టం కాబోదని మాస్టర్ బ్లాస్టర్ అంచనచా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments