Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో దారుణం... టెన్త్ విద్యార్థినిపై ఐదుగురి సాముూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:11 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కామాంధులైన ఇద్దరు స్నేహితులు బలవంతంగా బైకుపై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు కామాంధులతో కలిసి అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక... రాత్రిపొద్దుపోయినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆ బాలిక ఇంటి సమీపంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తన ఇద్దరు స్నేహితులు బైకుపై హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ మరో ముగ్గురుతో కలిసి అత్యాచారం చేశారంటూ బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పైగా, ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ, చెబితే చంపేస్తామని హెచ్చరించారని తెలిపారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మరోముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments