Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి సలహాతో భర్తను చంపిన భార్య.. 3 నెలల తర్వాత కనిపెట్టిన కుమార్తె

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (20:18 IST)
మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలో కట్టుకున్న భార్యను ఓ భార్య కిరాతకంగా చంపేసింది. తన ప్రియుడి చెప్పిన మాటలు విని ఈ ఘాతుకానికి పాల్పడింది. నిద్రపోతున్న భర్త ముఖంపై దిండి నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయినట్టుగా బంధువులను నమ్మించి అంత్యక్రియులు కూడా పూర్తి చేసింది. కానీ, మూడు నెలల తర్వాత తల్లి మొబైల్ ఫోన్‌లోని రికార్డింగ్ కాల్స్‌ను పరిశీలించిన కుమార్తె.. తల్లి చేసిన నేరాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇపుడు ఆమె జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రపూర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను ఆయన భార్య రంజన ఆగస్టు 6వ తేదీన హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చెప్పింది. అతను ఇచ్చిన సలహా మేరకు తన భర్త గుండెపోటుతో చనిపోయినట్టు కుమార్తెతోపాటు బంధువులను నమ్మించి, అంత్యక్రియలు పూర్తిచేసింది. 
 
అయితే, తండ్రి మరణించిన మూడు నెలల తర్వాత కుమార్తె శ్వేత తన స్నేహితులకు ఫోన్ చేసేందుకు తల్లి మొబైల్‌ను తీసుకుంది. అందులే రికార్డింగ్ అయిన కాల్ లిస్టును పరిశీలించగా, రంజన తన ప్రియుడితో మాట్లాడిన మాటలు విని నిర్ఘాంతపోయింది. శ్వేత ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంజనను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments