Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది నెలల కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 15 మే 2023 (09:34 IST)
అదనపు కట్నం కోసం అత్తింటివారు చేస్తున్న వేధింపులు తాళలేకపోయిన ఓ వివాహిత తన పది నెలల వయస్సున్న కన్నకూతురితో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రాంనగర్ బాకారంలో నివాసముంటున్న విజయ వసంతకుమారి, విద్యాసాగర్‌ అనే దంపతులకు పది నెలల కుమార్తె విద్యాధరణి అనే కుమార్తె ఉంది. విద్యాసాగర్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి కాగా పెళ్లి అయిన నాటి నుంచి తల్లి, సోదరితో కలిసి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 13న ఉదయం భార్యాబిడ్డలను ఇంట్లోనే ఉంచిన విద్యాం సాగర్.. తల్లిని తీసుకుని అక్క ఇంటికి వెళ్లాడు. విద్యాసాగర్ శనివారం అర్థరాత్రి తిరిగి ఇంటికి రాగా వసంత కుమారి తలుపు తీయలేదు. చుట్టు పక్కల వారి సహకారంతో తలుపులు తెరిచి చూడగా వసంతకుమారి, విద్యాధరణి విగతజీవులై కనిపించారు. 
 
తల్లీకూతుళ్లు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, అదనపు కట్నం కోసమే తన కూతురు, మనుమరాలిని విద్యాసాగర్ హత్య చేశాడని వసంతకుమారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments