Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికాసేపట్లో కన్యాదానం చేయాలి: ఇంతలో తల్లిదండ్రులు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:44 IST)
క్షణికావేశంలో పెద్దాయన తీసుకున్న నిర్ణయం పెళ్లి మండపంలో విషాదాన్ని నింపింది. మరికొద్దిసేపట్లో కన్యాదానం చేయాల్సిన ఆ దంపతులు కాటికి పయనమయ్యారు. పెళ్లి జరగడానికి మరికొన్ని నిమిషాల ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాలు ఇలా వున్నాయి. విశాఖపట్టణం మద్దిలపాలెంలో పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు కనిపించకుండా పోయారు. వారు ఎటు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదు. కన్యాదానం చేయాల్సిన దంపతులు కనిపించకపోయేసరికి అంతా వెతకగా చివరికి వారి ఇంట్లో విగతజీవులై కనిపించారు.
 
పోలీసులకి ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. విశాఖపోర్టు విశ్రాంత ఉద్యోగి అయిన 63 ఏళ్ల జగన్నాథరావు భార్య 57 ఏళ్ల విజయలక్ష్మి గత కొంతకాలంలగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీనివల్ల చీటికిమాటికి భర్తతో విజయలక్ష్మి వాదనకు దిగేదనీ, ఎంత సర్ది చెప్పినా ససేమిరా అంటుండేదని ఇరుగుపొరుగువారు చెప్పారు.
 
ఈ కారణంతోనే భర్త విసిగిపోయారనీ, పెళ్లి మంటపంలోనూ ఇలాగే గొడవ పెట్టుకోవడంతో ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెను హత్య చేసి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం తేలనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments