Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య గొడవ - ట్రిపుల్ మర్డర్ - ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరకు ముగ్గురి హత్యకు.. ఓ ఆత్మహత్యకు దారితీసింది. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం యూపీలోని బల్లియా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బల్లియా జిల్లా బన్స్‌‍దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సభ దేవ్‌డిహ్‌లో తోటలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు హత్యకు గురైనట్టు గుర్తించారు. వీరి గొంతులను పదునైన ఆయుధంతో కోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతదేహాలకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు దేవ్‌డిహ్‌కు చెందిన మోహన్‌ రాయ్ కుమారుడు శ్రవణ్ రామ్‌గా గుర్తించారు. అతని భార్య శశికళా దేవి (35), వారి ఇద్దరు పిల్లలను శ్రవణ్ పదునైన ఆయుధంతో హత్య చేసి, ఆపై శ్రవణ్ రామ్ బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుందని, దీంతో ఆవేశానికి లోనైన శ్రవణ్ రామ్... ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments