Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సరదా... ప్రైవేటు భాగాలపై గాలి పంప్ చేయడంతో...

Webdunia
గురువారం, 11 మే 2023 (09:41 IST)
తన స్నేహితుడిని ఆట పట్టించేందుకు అతని స్నేహితుడు చేసిన ఓ సరదా ప్రాణాలు తీసింది. తన స్నేహితుడి ప్రైవేటు భాగాల (పురుష నాళంలోకి) పై గాలిని పంప్ చేయడంతో అతను చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
అస్సాంకు చెందిన మింటూ, సిద్ధార్థ్ అనే ఇద్దరు స్నేహితులు వలస కూలీలుగా కేరళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ సరదాగా మింటూను ఆటపట్టించేందుకు అతని ప్రైవేటు భాగాల్లోకి కంప్రెషర్‌ పంపుతో గాలిని పంపింగ్ చేశాడు. దీంతో మింటూకు కడుపు ఉబ్బిపోయింది. దీంతో భయపడిపోయిన సిద్ధార్థ్.. ఆ వెంటనే మింటూను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు.
 
అతన్ని పరీక్షించిన వైద్యులు... అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తన స్నేహితుడు మింటూ హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడని వైద్యులకు సిద్ధార్థ్ చెప్పాడు. దీంతో అనుమానించిన వైద్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, మింటూను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments