Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:55 IST)
బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ వారిపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
హైదరాబాద్ నగరంలో తాజాగా మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సమాజంలో మహిళల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్‌లోని చిల్డ్రన్స్ హోమ్‌లో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. గ్రేస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి నలుగురు బాలికలు తప్పించుకోగా అందులో ఇద్దరు సంగారెడ్డిలో, ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో ఆశ్రయం పొందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ సమయంలో, అకౌంటెంట్ మురళి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు అధికారులకు చెప్పింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం