Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిక్నిక్‌కు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం.. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:43 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత స్నేహితురాలిపై సామూహిక లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, వారి నుంచి డబ్బు కూడా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దిగ్భ్రాంతికర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి సమీపంలోని ఓ పిక్నిక్ స్పాట్‌కు వెళ్లారు. అక్కడ కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడి చేశారు. తొలుత వారి వద్ద ఉన్న డబ్బు, నగలను బెదిరించి తీసుకున్న దుండగులు.. ఆ తర్వాత మహిళల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఓ ట్రైనీ ఆఫీసర్ పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. 
 
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments