Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్లతో చెలగాటమా? మోదీకి దిమ్మతిరిగింది.. అద్వానీతో భేటీ ఎప్పుడు?

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింది. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని.. మోదీ హవాకు బ్రేక్ పడుతోందని కర్ణాటక ఎన్నికలే చెప్పేశాయని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం,

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (10:56 IST)
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింది. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని.. మోదీ హవాకు బ్రేక్ పడుతోందని కర్ణాటక ఎన్నికలే చెప్పేశాయని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం, బీజేపీ తీరును శివసేన పార్టీ తూర్పారబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ కొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగా సీనియర్ నేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తోంది. 75 ఏళ్లకు పైబడిన వారిని ఎన్నికలకు, పదవులకు దూరంగా ఉంచాలని బీజేపీ అధిష్ఠానం గతంలో భావించింది. ఈ నిబంధనను బీజేపీ పక్కనబెట్టి సీనియర్లను రంగంలోకి దించాలని ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 
 
అప్పుడే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమవుతుందని.. లేకుంటే బీజేపీ 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎల్ కే అద్వానీ తిరిగి పోటీ చేస్తే బాగుంటుందని మోదీ అభిప్రాయపడుతున్నారని మీడియా కూడా కోడైకూస్తోంది.

ఈ విషయమై చర్చించేందుకు అద్వానీని మోదీ కలుస్తారని తెలుస్తోంది. మిగిలిన సీనియర్లతో కూడా చర్చలు జరిపేందుకు బీజేపీ నేతలు సంసిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments