Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 3న రజినీ రాజకీయ ప్రవేశం... అల్లుడు ధనుష్‌కి ఎందుకు అంత ఆత్రం?

దక్షిణాది రాష్ట్రాల సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ వచ్చిన రజినీ జూలై 3వ తేదీన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకున్న తరువాతనే ఈ నిర్ణయం తీస

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (12:23 IST)
దక్షిణాది రాష్ట్రాల సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ వచ్చిన రజినీ జూలై 3వ తేదీన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకున్న తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోజే పార్టీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది. 
 
అయితే అభిమానుల మధ్య కాకుండా నేరుగా తన ఇంటిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సింపుల్‌గానే చేయాలన్నది రజినీ ఆలోచన. ఎక్కడ కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రావాలని రజినీ నిర్ణయించుకున్నారట. రజినీకి ఏ విషయమైనా ముందు నుంచి ప్రశాంత వాతావరణంలోనే జరుపుకోవడం అలవాటు. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు కూడా అలాగే ఉండాలన్నది రజినీ అభిప్రాయం.
 
తలైవా రజినీ రాజకీయాల్లోకి రావాలని గత 20 సంవత్సరాలుగా అభిమానులు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల అయితే రజినీ అభిమానులు తలైవా భారీ పోస్టర్లు వేసి రజినీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం కాస్త రజినీకి కోపం తెప్పించింది. రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేని రజినీ అభిమానులను దూరంగా ఉంచడం ప్రారంభించాడు. అయితే జయలలిత మరణం తరువాత అభిమానుల నుంచి మళ్ళీ అదే డిమాండ్. దీంతో రజినీ ఆలోచనా సరళి మారింది. నేరుగా అభిమానులతోనే సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అంతలోనే తమిళ మున్నేట్ర పడై, నామ్ తమిళన్ పార్టీలు రజినీ రాజకీయాల్లోకి రాకూడదని చేసిన రాద్దాంతంతో వెనక్కి తగ్గారు. 
 
అంతేకాదు ముంబైలో కాల సినిమా షూటింగ్‌లో ఉన్న రజినీ రాజకీయాలపై మెల్లమెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే రజినీ సోదరుడు ఉన్నట్లుండి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రజినీ రాజకీయాల్లోకి వస్తున్నాడని చెప్పాడు. అయితే రజినీ మాత్రం ఎక్కడా దానిపైన మాట్లాడలేదు. స్వయంగా రజినీకి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంది. 
 
రజినీ రాజకీయాల్లోకి రావాలని ఆయన అల్లుడు ధనుష్ కూడా కోరుకుంటున్నారు. ఐతే అల్లుడు ధనుష్ మామ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ మరీ అంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారంటూ కొందరు చర్చ మొదలెట్టాశారు. మరోవైపు తన రాజకీయ అరంగేట్రంకు సంబంధించి కాల షూటింగ్‌లో ఉన్న రజినీ నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా చర్చించారట. జూలై 3వ తేదీ చాలా బాగుందని.. ఆరోజు రాజకీయాలపై ప్రకటన చేస్తానని చెప్పినట్లు సమాచారం. 
 
తలైవా ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి కాదు.. వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నది కుటుంబ సభ్యులకు తెలుసు. అందుకే ఒకే అనేశారట. అయితే ఇప్పటికే తలైవా వెంట వెళ్ళడానికి కొంతమంది ఎమ్మెల్యేలు సిద్థంగా కూడా ఉన్నారు. వారిని కలుపుకుని రజినీ ముందుకు వెళతారా..లేక కొత్త రక్తంతో కొత్త వారిని పార్టీలోకి తీసుకుంటారన్నది త్వరలో తేలిపోనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments