Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరును వణికిస్తున్న అక్రమ సంబంధాల హత్యలు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:26 IST)
అక్రమ సంబంధాల నేపధ్యంలో జరుగుతున్న హత్యలు గుంటూరును వణికిస్తున్నాయి. మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మృతి కేసులు, చివరకు హత్యలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవటానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. గుంటూరు జిల్లాను వరుస హత్యలు వణికిస్తున్నాయి.
 
వరుస పెట్టి హత్యలు జరుగుతుండటం, అవి కూడా అక్రమ సంబందాలు నేపధ్యంలోనే జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పిడగురాళ్ళ పురుగు మందుల వ్యాపారి దారుణ హత్య, నిన్న చెరుకుపల్లిలో ఆర్ఎంపీ వైద్యుడి దారుణ హత్య, ఇప్పుడు ఒక మహిళా టీచర్ దారుణ హత్య.
 
అంతేకాదు మంగళగిరిలో భవనిర్మాణ పనులు చేసుకునే సీతారామంజనేయులు కూడా అక్రమ సంబంధం నేపధ్యంలోనే హత్యకు గురయ్యాడు. అంతేకాదు వేమూరు మండలం కుచ్చెళ్ళపాడుకు చెందిన వ్యవసాయ కూలి ప్రకాశరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంపై కూడా అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది.
 
భార్యే అక్రమ సంబంధం నేపధ్యంలో హత్య  చేయించిందని ఫిర్యాదు చేయటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు, అవి కూడ అక్రమ సంబంధం నేపధ్యంలో జరిగినవిగా వెల్లడి కావటం సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments