Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పువ్వుతో కట్‌లెట్ తయారీనా? ఎలా?

అరటి పండు పువ్వుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అర‌టి పువ్వును తినడం ద్వారా స్త్రీల‌కు రుతుక్ర‌మం సక్రమంగా ఉంటుంది. బాలింతలకు మంచి ఆహారం. ఇందులో చాలా పోష‌కాలు ల‌భించ‌డం వ‌లన అటు త‌ల్లికి, ఇటు శి

Webdunia
బుధవారం, 18 జులై 2018 (13:09 IST)
అరటి పండు పువ్వుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అర‌టి పువ్వును తినడం ద్వారా స్త్రీల‌కు రుతుక్ర‌మం సక్రమంగా ఉంటుంది. బాలింతలకు మంచి ఆహారం. ఇందులో చాలా పోష‌కాలు ల‌భించ‌డం వ‌లన అటు త‌ల్లికి, ఇటు శిశువుకు కూడా మంచి చేస్తుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు అర‌టిపువ్వు త‌ర‌చుగా తీసుకుంటే వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు క్ర‌మంగా త‌గ్గిపోతాయి. మరి ఇటువంటి అరటి పువ్వుతో కట్‌లెట్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
అరటి పువ్వు తరుగు - 2 కప్పులు 
ఉల్లి తరుగు - అరకప్పు
ఉడికించిన బంగాళదుంప గుజ్జు -1 కప్పు
అల్లం - అంగుళం ముక్క 
పచ్చిమిర్చి - 2 
మిరియాల పొడి - 1 స్పూన్ 
కరివేపాకు - 4 రెబ్బలు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
గరం మసాల - 1 స్పూన్ 
ఉప్పు - రుచికి తగినంత
గుడ్డు - 1 
బ్రెడ్‌ పొడి - తగినంత
నూనె - వేగించడానికి సరిపడా
పసుపు - చిటికెడు.
 
తయారుచేసే విధానం: 
ముందుగా అరటి పువ్వు తరుగును బాగా కడిగి తగినన్ని నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఇప్పుడు నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగును వేసి బాగా వేగించాలి. తరువాత గరం మసాల, మిరియాలపొడి, ఉప్పు, ఉడికించిన పువ్వు తరుగు, బంగాళదుంప గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. నిమిషం తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఈ ముద్దను కట్‌లెట్స్‌గా చేసుకుని గిలకొట్టిన గుడ్డులో ముంచి బ్రెడ్‌ పొడిలో కలుపుకొని నూనెలో దోరగా వేగించాలి. గుడ్డు ఇష్టపడనివారు మైదా జారును వాడవచ్చును. అంతే అరటి పువ్వు కట్‌లెట్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments