Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యం వడలు.. పిల్లలు లొట్టలేస్తూ తింటారు...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (17:21 IST)
పండుగ వచ్చిందంటే ఇంట్లోనే రకరకాల పిండి వంటలు, తినుబండారాలు తయారుచేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడూ చేసే వంటలే కాకుండా అప్పుడప్పుడు మార్చి మార్చి కొత్త వంటలు చేయడం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసిన వెరైటీస్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. కనుక ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
 
కావలసిన పదార్ధాలు..
సగ్గుబియ్యం-పావుకిలో
బంగాళదుంపలు- 3
పచ్చిమిర్చి-6
ఉప్పు- తగినంత
జీలకర్ర- టీ స్పూన్
కొత్తిమీర తురుము- కొద్దిగా
నూనె- వేయించడానికి సరిపడా
బియ్యంపిండి-2 టీ స్పూన్లు
వంటసోడా- చిటికెడు
 
తయారుచేసే విధానం...
సగ్గుబియ్యం ఓ గంట ముందే నానబెట్టాలి. తరువాత బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో సగ్గుబియ్యం, చిదిమిన ఆలూ, జీలకర్ర, పచ్చిమిర్చితురుము,ఉప్పు, బియ్యంపిండి, వంటసోడా, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ప్లాస్టిక్ కాగితం మీద నూనె రాసుకుంటూ వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments