Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ''ఏడు'' అనే సంఖ్యకు సంబంధం వుందా?

శ్రీవారి వెంకన్న ఆలయం ఏడు ద్వారాలతో నిర్మితమైవుంది. వీటిని వైకుంఠ ద్వారాలుగా వ్యవహరిస్తారు. కులశేఖరపడి, రాములవారి మేడకు రెండు ద్వారాలు, జయ, విజయ, బంగారు, వెండి ప్రధాన ద్వారాలుగా ఇవి విభజితమై వున్నాయి.

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (17:22 IST)
శ్రీవారి వెంకన్న ఆలయం ఏడు ద్వారాలతో నిర్మితమైవుంది. వీటిని వైకుంఠ ద్వారాలుగా వ్యవహరిస్తారు. కులశేఖరపడి, రాములవారి మేడకు రెండు ద్వారాలు, జయ, విజయ, బంగారు, వెండి ప్రధాన ద్వారాలుగా ఇవి విభజితమై వున్నాయి. ఏడు అనే సంఖ్యతో శ్రీవారికి వీడని బంధం వుంది.


ఏడు కొండల స్వామి అనే పదం వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి, తీర్థాద్రి అనే ఏడు కొండలకు ప్రతీక. 1958లో ఆరంభించిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమం ఇప్పటికీ ఆరుసార్లు పూర్తయింది. ఏడవ ద్వాదశవసంతంలో స్వామి అడుగులు వేశారు.
 
స్వామివారు దేవలోకం నుంచి భువికి వచ్చిన వెంటనే విశ్వరూపంలో కొలువుతీరారు. అప్పుడు ఏడుగురు మహర్షులు భువికి వచ్చి ప్రార్థనలతో స్వామిని స్తుతించి శాంతపరుస్తారు. ఆ ఏడుగురు ఎవరంటే..? భృగు, మరీచి, పులస్త్యుడు, పులహ, విశిష్ట, ఆత్రి, క్రతువులు. వీరు స్వామిని స్తుతించి.. విశ్వరూపం నుంచి సాధారణ రూపానికి వచ్చేలా చేశారు.
 
అలాగే శ్రీవారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా ఏడు సంఖ్యతో అనుబంధం వుంది. అదెలాగంటే.. బ్రహ్మోత్సవంలో స్వామివారు 16 వాహనాల్లో ఊరేగుతారు. దీనిని కూడితే ఏడు వస్తుంది. ఆ వాహనాలు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, దంతపల్లకి, గరుడ, స్వర్ణరథం, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, రథ, అశ్వ వాహనములు 16గా పేర్కొన్నారు.
 
వాహనసేవలో ముందుభాగాన సప్తబలగాలు నడుస్తుంటే స్వామి తిరువీధి ఉత్సవం రమణీయంగా, వైదికంగా, అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. అవి బ్రహ్మరథం, గజములు, అశ్వములు, వృషభములు, దివ్యప్రబంధగోష్ఠి, వేదపారాయణం, భక్తజనులు. 
 
అలాగే బ్రహ్మోత్సవంలో జరిగే వైదిక కార్యక్రమాలు కూడా ఏడే. అవి కోయిల్‌ ఆళ్వార్‌తిరుమంజనం, అంకురార్పణం, ధ్వజారోహణం, వాహనసేవలు, విశేషహోమాలు-కలశారాధన, స్నపనతిరుమంజనం, చక్రస్నానం అని.. స్వామి వారి గొప్పదనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments