Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

సిహెచ్
సోమవారం, 31 మార్చి 2025 (13:39 IST)
క్రెడిట్: ఫ్రీపిక్
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. 
 
ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది. ఎందుకంటే అలా మచ్చలు, పసుపు రంగులో వున్న కాయలపై ఈ ఫంగస్ పట్టుకుని వుంటుంది. మనం వాటిని కూరల్లో వేసుకున్నప్పుడు ఈ ఫంగస్ కాస్తా మన జీర్ణాశయానికి చేరుతుంది.
 
ఫలితంగా జీర్ణ సమస్యలతో పాటు కాలేయ కేన్సర్ వచ్చే ప్రమాదం వుందని చెబుతున్నారు. అదేవిధంగా వేరుశనక్కాయలు కొనుగోలు చేసేటపుడు కూడా జాగ్రత్త వహించాలి. నల్ల మచ్చలు, పసుపు మచ్చలతో వున్నటువంటి కాయల జోలికి వెళ్లకుండా వాటిని దూరం పెట్టాలి. ఐతే బాగా ఎండబెట్టడం, వేయించడం వంటి పద్ధతుల ద్వారా ఈ ఫంగస్ కాస్త తగ్గే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

Amaravati 2.0: అమరావతి 2.0 ప్రాజెక్టుకు వైకాపా చీఫ్ జగన్‌కు ఆహ్వానం

Chilli Powder: రూ.19కి రీఛార్జ్ చేయమన్నాడు.. కళ్లల్లో కారం కొట్టి రూ.50వేలు దోచుకున్నాడు.. వీడియో

హఫీజ్ సయీద్‌ను లేపేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్, పాకిస్తాన్ బెంబేలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

తర్వాతి కథనం
Show comments