మధుమేహం ఉన్నవారు పండ్లు తినాలా? వద్దా?

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (15:10 IST)
మధుమేహం ఉన్నవారు పండ్లు తినాలా? వద్దా? అసలు నోటికి తీపి తగలకూడదని అంటారు. స్వీట్స్, తీయని పండ్లు మానెయ్యాలని అంటారు. కొందరేమో పండ్లు తినాలంటారు. అసలు ఏది కరెక్ట్? ఏ పండ్లు తీసుకోవాలి? 
 
నిజానికి పండ్లు నేచురల్ హీలర్స్. వీటిలోని అనేకానేక పోషకాలు ఆరోగ్యాన్నిస్తాయి. ఫైబర్, విటమిన్ బి, సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా పండ్లు తీసుకోవాలి. వీటిలోని షుగర్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని భయపడనవసరం లేదు. 
 
2-4 పోర్షన్ సైజు పండ్లు రోజు మొత్తంలో తీసుకోవచ్చు. పండ్లును భోజనంతో పాటు లేదా స్నాక్స్‌లాగా తీసుకోవచ్చు. ఒక పోర్షన్ అంటే ఒక మీడియం ఆపిల్ సైజు అన్నమాట.
 
ఏ పండు ఎంత తీసుకోవాలి?
మీడియం సైజు ఆపిల్, ఆరెంజ్, బత్తాయి, పీర్, జామ.
 
ఆల్‌బుఖరా-5, ద్రాక్ష-ఒక కప్పు, స్ట్రాబెర్రీలు- ఒక కప్పు, బొప్పాయి- రెండు కప్పులు. 

బాగా తియ్యని పండ్లయితే... అరటి పండు- చిన్నది, మామిడికాయ- 3 ముక్కలు, పుచ్చకాయ- 2 ముక్కలు, తర్బూజా- 2 పెద్ద ముక్కలు, సీతాఫలం- మీడియం సైజు, ఫైనాపిల్- 3 ముక్కలు.
 
ఎప్పుడు తినాలి?
ఉదయం అల్పాహారంతో ఒక పోర్షన్
మిడ్ మార్నింగ్ స్నాక్స్‌లో ఒక పోర్షన్
సాయంత్రం స్నాక్స్‌లో ఒక పోర్షన్ తీసుకుంటే రోజుకు కావాల్సిన పండు తిన్నట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి

ఎంకె స్టాలిన్‌తో జగన్ సంబంధాలు.. బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనకుందా?

వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?

ఇండియా వెళ్లేప్పుడు జాగ్రత్త అన్నారు, కానీ ఇక్కడకొచ్చి చూస్తే: విదేశీయురాలి అనుభవం

అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

తర్వాతి కథనం
Show comments