పాతాళానికి చికెన్ ధరలు .. ఆ పండు ధరకు రెక్కలు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (15:31 IST)
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. ఇప్పటికే పౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న దుష్ప్రచారంతో పాటు... బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ ధరలు పూర్తిగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తుంటే.. మెట్రో నగరాల్లో మాత్రం కేజీ చికెన్ 30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. అలాగే, మటన్ ధరలు కూడా కొంతమేరకు తగ్గాయి. 
 
దీంతో మాంసాహార, బిర్యానీ ప్రియులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. చికెన్, మటన్ బిర్యాలను పుష్టిగా ఆరగించేవారు.. ఇపుడు వాటికి దూరంగా ఉంటూ పనస పండును లాగించేస్తున్నారు. ఫలితంగా నిన్నామొన్నటి వరకు రూ.50 పలికిన పనసపండు ఇపుడు ఏకంగా రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. 
 
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగవంతం అవుతోన్న నేపథ్యంలో.. చికెన్, మటన్‌ల బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని కొందరు చెబుతున్నారు. కాగా మాంసాహారం తింటే కరోనా వ్యాప్తి చెందదని డాక్టర్లు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం అనుమానం వీడటం లేదు. దీంతో చికెన్, మటన్ రేట్లు భారీగా పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments