Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశాక.. పొట్ట నిండిపోయేలా నీటిని తాగేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..

శరీరానికి నీరే ఆధారం. నీటిని సక్రమంగా తీసుకోకపోతే.. ఒబిసిటీ ఆవహిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నీటిని ఎప్పుడుపడితే అప్పుడు సేవించకూడద

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (15:48 IST)
శరీరానికి నీరే ఆధారం. నీటిని సక్రమంగా తీసుకోకపోతే.. ఒబిసిటీ ఆవహిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నీటిని ఎప్పుడుపడితే అప్పుడు సేవించకూడదని వారు చెప్తున్నారు. పరగడుపున రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. పరగడుపున తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి చేకూరుతుంది. ఇలా రోజూ చేస్తే శరీరంలోని మలినాలు వెలివేయబడుతాయి. 
 
అలాగే ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు ఒక గ్లాసు నీరు సేవించాలి. ఇలా చేస్తే బరువు తగ్గుతారు. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నీటిని సేవించడం మంచిది కాదు. ఆహారం తీసుకున్న వెంటనే పొట్ట నిండేలా నీటిని సేవిస్తే.. అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా నీటిని తాగకూడదు. నీటికి బదులు మజ్జిగ తీసుకోవచ్చు. ఇది ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు కాసిన్ని నీరు సేవించండి. పది నిమిషాల తర్వాత ఆహారం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.  
 
నీరసంగా ఉన్నప్పుడు మన మెదడులో నీరు 75 శాతం మాత్రమే ఉందని గమనించాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినన్ని నీరు సేవించాలి. నీరసంగా ఉన్నప్పుడు తప్పకుండా నీటిని సేవించడాన్ని మరిచిపోకూడదు. అయితే సాయంత్రం పూట తక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు వ్యాయామానికి అనంతరం నీటిని తీసుకోవడం ద్వారా కండరాలు బలపడతాయి.

అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు నీటిని సేవించడం మంచిది. గర్భిణీ మహిళలు, బాలింతలు అధికంగా నీటిని తీసుకోవాలి. కనీసం రోజుకు 10 గ్లాసుల నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మిగిలిన వారు రోజుకు 8 గ్లాసుల నీటిని తీసుకోవడం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments