Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి మిరపకాయ పవర్‌ ఎంతంటే..!

వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిరపకాయని వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పచ్చి మిరపకాయలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. ప

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (13:59 IST)
వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిరపకాయని వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పచ్చి మిరపకాయలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. పచ్చి మిరపని వాడేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెపుతుంటారు.
 
పచ్చి మిరపకాయలో ‘విటమిన్‌ సి’ పుష్కలంగా దొరుకుతుంది. అరకప్పు తరిగిన పచ్చి మిరపతో కనీసం 181 మిల్లీగ్రాముల ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. అంటే మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్నమాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి - జీర్ణప్రక్రియ ఎంత చురుగ్గా ఉందనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చి మిరపకాయలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా పచ్చి మిరపకాయ సహాయపడుతుంది.
 
పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవనశైలిలో హైపర్‌టెన్షన్‌కు గురి కాని వారు చాలా అరుదు. దీన్ని అంతోఇంతో అడ్డుకుంటుంది పచ్చి మిరప. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతోపాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల్ని దరిచేరనీయదు. ఏవైనా ప్రమాదాల వల్ల ఏర్పడేటువంటి తీవ్రగాయాల బ్లడ్‌ క్లాటింగ్‌ సమస్యని పచ్చి మిరపకాయలోని విటమిన్‌ కె నివారిస్తుంది.
 
పచ్చి మిరపకాయకి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది. ఇందులోని విటమిన్‌ ఎ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. తద్వారా దృష్టి లోపాలు రావు. వీటన్నిటితోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి దీనికుంది. చిన్నచిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. రుతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది పచ్చి మిరప.
 
పచ్చి మిరపకాయ రెగ్యులర్‌గా తింటే.. వయసు రీత్యా చర్మం మీద వచ్చే ముడతలు కూడా తగ్గడంతోపాటు కొన్ని రకాల వైరస్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments