Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు నెలలో తీసుకోదగిన ఆహారం, క్యాలీ ఫ్లవర్ రైస్ ఎలాగంటే?

ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహార అలవాట్లతో పాటు తీసుకునే ఆహారం కూడా మారిపోతుంటుంది. నవంబరు నెలలో విరివిగా లభించేవాటిలో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇందులో విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామాన

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (16:44 IST)
ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహార అలవాట్లతో పాటు తీసుకునే ఆహారం కూడా మారిపోతుంటుంది. నవంబరు నెలలో విరివిగా లభించేవాటిలో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇందులో విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత అయినా తీసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఫైబర్‌లను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాలీఫ్లవర్‌లోని యాంటీ యాక్లిడెంట్లు క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. 
 
కిడ్నీ సంబంధిత వ్యాధులకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి క్యాలిఫ్లవర్ చక్కటి పరిష్కారం. వారానికి రెండు లేదా మూడుసార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇక క్యాలీఫ్లవర్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - రెండు కప్పులు. 
నూనె - పావు కప్పు. 
పసుపు - ఒక టేబుల్‌ స్పూన్‌. 
క్యాలీఫ్లవర్‌ - ఒకటి. 
ఆలుగడ్డలు - మూడు. 
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - ఒక స్పూన్‌. 
పచ్చిమిర్చి - నాలుగు. 
ఉల్లిపాయలు - మూడు. 
టమోటాలు - మూడు. 
ఉప్పు - తగినంత. 
 
తయారీ విధానం: 
ముందుగా బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ఆ తర్వాత దానిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కాలిఫ్లవర్‌ను వేడినీటిలో ఉడికించుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేపుకోవాలి. 
 
తర్వాత పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసి వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి చివరిగా ఉడికించిన కాలిఫ్లవర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన బాస్మతి రైస్‌తో కలుపుకుని, ఆలు ముక్కలు చేర్చి హాట్ హాట్‌గా చికెన్ గ్రేవీతో సర్వ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments