Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ బాటిల్స్ కొంటున్నారా? ఇక వద్దే వద్దు.. ఎందుకు?

ఇంటి నుంచి వాటర్ బాటిల్‌లో నీళ్లు మోసుకెళ్లకుండా.. బయట షాపుల్లో ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారా? అయితే ఇకపై ఆ అలవాటును మార్చేసుకోండి అంటున్నారు.. పరిశోధకులు. ప్యాక్ చేసిన వాటర్‌ సురక్షితం కా

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (11:31 IST)
ఇంటి నుంచి వాటర్ బాటిల్‌లో నీళ్లు మోసుకెళ్లకుండా.. బయట షాపుల్లో ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారా? అయితే ఇకపై ఆ అలవాటును మార్చేసుకోండి అంటున్నారు.. పరిశోధకులు. ప్యాక్ చేసిన వాటర్‌ సురక్షితం కాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్లో కంటికి చిక్కని సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు వుంటాయని స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ అధ్యయనంలో వెల్లడి అయ్యింది.
 
అలాగే ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్‌లో కార్బన్ అవశేషాలున్నాయని.. బాటిళ్లపై కొన్ని దేశాల్లో సంపూర్ణ నిషేధం విధించారని పరిశోధకులు తేల్చారు. దీంతో భారత్‌తో పాటు ఇండోనేషియా, అమెరికా, చైనా, ఇండోనేషియాకు చెందిన దేశాల్లో బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిళ్లపై అధ్యయనం చేస్తున్నారు. ఇంకా బయట షాపుల్లో అమ్మే బాటిల్ నీరు కూడా అంత సురక్షితం కాదని అధ్యయనం తేల్చింది. 
 
ఈ అధ్యయనంలో తొమ్మిది దేశాలకు చెందిన 249 వాటర్ బాటిళ్లను పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారం 90 శాతం వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు వున్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు. భారత్, చైనా, అమెరికా,  ఇండోనేసియా, కెన్యా, లెబనాన్, మెక్సికో, థాయ్‌లాండ్‌ల్లోని అత్యుత్తమ బ్రాండ్లకు చెందిన ప్యాకేజ్డ్ వాటర్‌ బాటిళ్లను పరిశోధకులు పరీక్షించి, నీటి నాణ్యతను విశ్లేషించారు.  
 
లీటరు నీటిలో పది సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ ప్లాస్టిక్ రేణువులున్న నీటిని తాగితే విరేచనాలు, థైరాయిడ్ వంటి రుగ్మతలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ నీటిని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తాగకూడదని.. ఒకవేళ తాగితే బరువు తక్కువున్న శిశువులు పుడతారని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments