Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? అలసట తప్పదండోయ్

శారీరక శ్రమ ద్వారా అలసట ఆవహిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే వాస్తవానికి మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏర్పడే అలసట కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని మెయిల్స్ పంపడం ద్వారా ఏర్పడుతుందని తాజా పరిశోధనలు తేల

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (12:48 IST)
శారీరక శ్రమ ద్వారా అలసట ఆవహిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే వాస్తవానికి మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏర్పడే అలసట కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని మెయిల్స్ పంపడం ద్వారా ఏర్పడుతుందని తాజా పరిశోధనలు తేల్చాయి. కంప్యూటర్ ముందు కూర్చున్నా.. శారీరక శ్రమకు సంబంధించిన పనులు చేసినా మెదడు, గుండె పనితీరు ఒకే విధంగా వుంటుందని అమెరికా పరిశోధకులు తేల్చారు. 
 
కంప్యూటర్ల ముందు కూర్చున్నా బస్తాలు మోసినా గుండె ఒకే రీతిలో ఆట్రినల్ ఉత్పత్తి చేస్తుంది. ఇక సెల్ ఫోన్‌ను గంటల పాటు ఉపయోగించే వారికి శారీరక శ్రమ కంటే మెదడు పనితీరు అధికంగా వుంటుంది. ముఖ్యంగా శరీరానికి కావలసిన ఆక్సిజన్ కంటే 20 రెట్లు అధికమైన ఆక్సిజన్ మెదడుకు అవసరమవుతుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల ఉపయోగం ద్వారా వాటిలోని ఎలక్ట్రానిక్ వేవ్స్ శరీరానికి అలసటను ఇస్తాయట. ఈ అలసట బరువు ఎత్తడం వంటి ఇతరత్రా శారీరక శ్రమ చేసిన వారికంటే అధికమని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఇలా గంటల పాటు కూర్చుని కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఏర్పడే అలసటను Computer fatigue అంటున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఒకేచోట కూర్చోవడం చేస్తారు. తద్వారా కండరాలు బిగుతుగా తయారవుతాయి. దీంతో వెన్నునొప్పి, మెడనొప్పి, కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణాలు రక్తపోటు, ఒబిసిటీ, మధుమేహం వంటి రుగ్మతలకు దారితీస్తాయి. 
 
ఇంకా కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్ల నుంచి విడుదలయ్యే కిరణాల ప్రభావం మెదడుపై పడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి తప్పదు. కంటికి దృష్టి లోపాలు తప్పవు. నిద్రలేమి కలుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి శారీరక, మానసిక ఇబ్బందులకు గురిచేసే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను తదేకంగా ఉపయోగించకుండా.. అవసరానికి మాత్రమే ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments