Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉలిక్కిపడిన భారతం... 'నిపా' వైరస్ గాలిలో వ్యాపిస్తుందా?

భారతావని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతుచిక్కని వైరస్‌ సోకి ఏకంగా 10 మంది చనిపోయారు. ఇది యావత్ భారతవనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేనా, ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఓ నర్సు కూడా ప

Webdunia
బుధవారం, 23 మే 2018 (09:40 IST)
భారతావని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతుచిక్కని వైరస్‌ సోకి ఏకంగా 10 మంది చనిపోయారు. ఇది యావత్ భారతవనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేనా, ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఓ నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇది మరింత విషాదానికి గురిచేసింది. ఆ వైరస్ పేరు నిపా. అసలు ఇలాంటి అంతుచిక్కని వైరస్ ఎలా వ్యాపించింది? ఎక్కడ నుంచి వచ్చింది? ఈ వైరస్‌ను నియంత్రించగలమా అనేది పరిశీలిస్తే...
 
నిజానికి నిపా వైరస్‌ కొత్తదేం కాదు. అరుదైనది, తీవ్రమైనది, ప్రాణాంతకమైనది. ఈ వైరస్‌తోనే ముగ్గురు కేరళ వాసులు చనిపోయారని పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ధృవీకరించింది. ఆ తర్వాత కొన్నేళ్లుగా వినిపించకుండా పోయింది. ఇపుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 
 
ఈ వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకొచ్చిన 'జూనోసిస్' (జంతువు నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌)గా ఇంతకుముందే గుర్తించింది. 'ఫ్రూట్‌ బ్యాట్స్' అనే ఒక రకం గబ్బిళాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పని చేస్తాయని కూడా గుర్తించారు. 
 
ఈ వైరస్‌ 1998లోనే మలేసియా, సింగపూర్‌లో బయటపడింది. అప్పట్లో ఈ వైరస్‌ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది. గబ్బిళాలు, పందులు, మనుషులు... వీళ్లలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకవచ్చు. ఈ వైరస్‌ సోకిన గబ్బిళాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకింది. 
 
ఈ వైరస్‌ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్‌ సోకిన జంతువు లేదా మనిషితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వెంటనే తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్టు అనిపించే కన్‌ఫ్యూజన్‌ మొదలైన లక్షణాలుంటాయి. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ ముదిరి కోమాలోకి వెళ్లిపోతారు. ఆ దశలో బ్రతికించడం కష్టం.
 
ఈ వైరస్‌ను నియంత్రించే టీకాలు ఇంకా తయారు కాలేదు. అయితే ఈ వైరస్‌ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స ఒక్కటే! ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిళాలు లేకుండా చూసుకోవాలి. చికిత్స చేసే వైద్యులు మాస్క్‌లు, గ్లోవ్స్‌ వేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

తర్వాతి కథనం
Show comments