ఒబిసిటీ.. చికెన్ జోలికి వెళ్ళొద్దు.. చేపలే ముద్దు..

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (16:10 IST)
రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తింటే చాలా సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఆహార పదార్థాల తయారీకి ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే ఉండదు. 
 
అదేవిధంగా వారానికి రెండుసార్లు చేపలను తీసుకుంటే ఒబిసిటీ సమస్య వుండదు. చేపలలో క్రొవ్వు ఉండదు. కేలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి మటన్, చికెన్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు చేపలను ఆహారంలో భాగం చేసుకోండి. 
 
రోజువారీ డైట్‌లో భాగంగా పచ్చని కాయగూరలు, ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది.  కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనానికి ముందు వెజ్ సూప్ తీసుకుంటే ఆహారాన్ని మితంగా తీసుకునే అవకాశం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments