Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒబిసిటీని దూరం చేసే రాగులు.. (video)

చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయోభేదం లేకుండా రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు అంటున్నారు.. వైద్యులు. రాగులతో తయారయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వార

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (18:37 IST)
చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయోభేదం లేకుండా రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు అంటున్నారు.. వైద్యులు. రాగులతో తయారయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. 
 
వృద్ధులు, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు రాగులతో చేసిన వంటకాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు రాగులు బలాన్నిస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడంతో బరువు పెరగరు. ఆకలిని సక్రమంగా వుంచే శక్తి రాగులకు వుంది. 
 
బియ్యం కంటే రాగుల్లో కార్పొహైడ్రేడ్లు తక్కువ. పీచు అధికమే. అందుకే రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఏమాత్రం పెరగవు. రాగులను అంబలిగానూ, సంకటిగానూ, రొట్టెలుగానూ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేకూరినట్టే. రాగులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెట్టే రాగుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమంగా వుంచుతుంది. 
 
ఇందులోని ధాతువులు మానసిక ఒత్తడిని కూడా దూరం చేస్తాయి. థైరాయిడ్ రోగులు రాగులను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. గర్భిణీ మహిళలు, బాలింతలు రాగులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటూ వుండాలి. ప్రసవానికి అనంతరం, నెలసరి సమయాల్లో రాగులను మహిళలు ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను క్రమబద్ధీకరించినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments