Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:55 IST)
నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. 
 
అదే కనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది.  ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. 
 
వీటిని రోజూ పరగడుపున లేదంటే.. అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తొలగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చిన లోపాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. 
 
పిల్లలకు బాదం పప్పుతో చేసిన పొడిని పాలలో కలిపి ఇవ్వడం ద్వారా వారి శరీరానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు కూడా నానబెట్టిన బాదం పప్పులు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments