Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో తినాల్సిన, తినకూడని పదార్థాలు ఏమిటి?

వేసవి వచ్చేసింది. ఈ వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశా

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (16:52 IST)
వేసవి వచ్చేసింది. ఈ వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశాతం అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
 
చాలామంది బయట నుంచి ఇంటికి చేరుకున్నాక ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను గటగటా తాగేస్తుంటారు. అలా తాగడం మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి పెరిగిపోతుంది. ఆహారం తీసుకునేముందు 10 నిమిషాలకు ముందు రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది. కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను సేవించడాన్ని తగ్గించాలి. కాకర, వంకాయ వంటివి వేసవిలో తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వేసవిలో ఇవి అంత త్వరగా జీర్ణంకావు. అలాగే మాంసాహారాన్ని కూడా తగ్గించుకోవడం మంచిది.
 
పుచ్చకాయలో 90 శాతం నీటి శాతం ఉండటంతో శరీరానికి తగిన నీటి శాతాన్ని పుచ్చకాయ అందిస్తుంది. కీరదోస ముక్కల్ని కూడా అధికంగా తీసుకోవచ్చు. వేసవిలో నీటిద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త అవసరం.
 
వేసవికాలంలో ఎక్కువగా పగటి పూట తిరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే సన్‌స్క్రీన్, టోపి, సన్‌గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి. వేసవికాలంలో తగినంత నిద్రపోవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం ఉత్తమం. తాజా ఆహారాన్నే తీసుకోవాలి. నిల్వ చేసిన ఆరోగ్యాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments