వరల్డ్ ఎగ్ డే: ఆరోగ్య ప్రదాత... రుచికరం..

"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గు

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:53 IST)
"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ఎగ్గేరియన్స్ పెరిగిపోతున్నారు. 
 
ప్రస్తుతం నానాటికీ కాయకూరల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏది కొనాలన్నా జేబుకు చిల్లు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అతి తక్కువ ధరకు ఎక్కువ పోషకాలుండే మంచి ఆహార పదార్థంగా గుడ్డు పేరుగడించింది. దీంతో రోజూ కోట్లకి కోట్ల గుడ్లు సేలవుతున్నాయి. అందుకే గుడ్డుకి భారీ డిమాండ్ పెరిగింది. రోజూ ఓ గుడ్డు తింటే హాస్పిటల్‌కి వెళ్లాల్సిన పనిలేదని పెద్దలతో పాటు వైద్యులు చెబుతుంటారు. 
 
గతంలో సఘటున ఒక వ్యక్తి సంవత్సరానికి 40 నుంచి 50 గుడ్లు లాగిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. రెస్టారెంట్ల నుంచి… బజ్జీ బండ్ల వరకు.. బేకరీల్లో కూడా ఎగ్టేస్ట్ దొరుకుతుంది. కేకుల్లో కూడా ఎగ్స్ వెరీ వెరీ స్పెషల్. దేశంలో ఎగ్గుని తినేవారిలో తమిళనాడు వారు ముందుండగా… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేసులో ఉంది. మన రాష్ట్రం నాలుగో ప్లేసులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎగ్స్‌ను తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చెపుతోంది.
 
ఇక గుడ్డు మీద జరుగుతున్న పరిశోధనలు కూడా ప్రతీ ఏటా కొత్త ఫలితాలను ఇస్తున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నాయి. ప్రతీ రోజు ఓ గుడ్డును తీసుకోవడం వల్ల బాడీ ఎదుగుదలకు, కంటిచూపు మంచిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్స్‌ను తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనడం కేవలం అపోహ మాత్రమే అనేది వైద్యుల మాట. ఎగ్గుతింటే ఎనర్జిటిక్‌గా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతిరోజూ బిస్కెత్తులు వేస్తున్న మహిళనే కరిచిన వీధికుక్కలు, వీడియో చూడండి

వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా అమర్చి రికార్డు చేశారు.. కన్నడ నటి ఫిర్యాదు

చంద్రబాబు విజన్‌ను బిల్‌గేట్స్ ప్రశంసించడాన్ని జగన్ జీర్ణించుకోలేకున్నారు : మంత్రి పార్థసారథి

మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయం మూసివేత - ఎందుకో తెలుసా?

బైకుపై అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు, రెండు ముక్కలైంది, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fauji shooting: తూఫ్రాన్ పేటలో ఫౌజీ షూటింగ్‌ - ప్రభాస్ కు గాయాలు వార్తలో అవాస్తవం లేదు !

Mohan Babu: మోహన్ బాబును చంద్రబాబు మోసం చేశాడా ? ఎందుకంటే...!

Nani: పారడైజ్ లో లౌడ్ ఎన్విరాన్‌మెంట్ పై కేర్ - విడుదల తేదీ మార్పు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి షోల్డర్ కీహోల్ సర్జరీ

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments