కడుపులో గ్యాస్... అబ్బ, తగ్గే మార్గమేంటి?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (22:29 IST)
4
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎసిడిటీ సమస్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం, చాతీలో మంట, కడుపునొప్పి లాంటి అనేక రకములైన ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. దీనికి మందులు వాడినా ఉపశమనం కలుగుతుంది కానీ... పూర్తిగా నయం అవ్వదు. అంతేకాకుండా మందులు ఎక్కువగా వాడడం వల్ల వేరే రకములైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాకాకుండా మన ఇంట్లో ఉన్న పదార్దాలతోనే గ్యాసు సమస్యని తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. గ్యాస్ సమస్య ఉన్నవారు ముఖ్యంగా హోటల్స్‌లో నూనెతో చేసిన పదార్థాలను పూర్తిగా వదిలేయాలి. మసాలాలు తగ్గించి తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున రాగి పాత్రలో నీటిని లీటరుకు తగ్గకుండా తీసుకోవాలి.
 
2. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం,మరియు ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
 
3. ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
 
4. కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్బుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడినీటిలో కలుపుకుని తాగడం వలన ఉదర భాగంలో ఏర్పడే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. 
 
5. బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత వికారాలు తగ్గిపోతాయి.
 
6. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యనుతగ్గించుకోవచ్చు.
 
7. అలాగే పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసీ మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. వీటితో పాటు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం మరియు నొప్పి తగ్గుముఖం పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments