Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశాక ఇలా చేయొద్దు...

చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (14:10 IST)
చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోజనం తర్వాత ఏమేమి చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం.
 
* చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోయేందుకు పడకెక్కుతారు. నిజానికి తినగానే వెంటనే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
* కొందరికి భోజనం చేయగానే స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే ప్రమాదం ఉంది.
 
* భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ వివిధ రకాల పండ్లు ఆరగించరాదు. ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.
 
* అన్నం తిన్న తర్వాత టీ తాగితే భోజనం జీర్ణంకాదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments