Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిగా కూర్చున్నారో అంతే సంగతులు.. ఐదు నిమిషాలైనా లేచి?

కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 1

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (13:35 IST)
కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 10 శాతం ఎండోమెట్రియల్ క్యాన్సర్, 6శాతం లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. గంటల సేపు కూర్చోవడం.. టీవీలు చూస్తూ జంక్‌ఫుడ్స్ లాగించేయడం ప్రమాదానికి దారితీస్తాయని వైద్యులు అంటున్నారు. 
 
అతిగా కూర్చోవడం అనారోగ్య సమస్యలను కొనితెచ్చి పెడుతుంది. అందుకే కనీసం గంటకోసారైనా ఐదు నిమిషాలపాటు లేచి కాస్త అటూఇటూ నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం పదినిమిషాలపాటు నడిచేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఫోను మాట్లాడేటప్పుడు నిల్చునో, నడుస్తూనో మాట్లాడండి. 
 
వీలైనంత వరకు నిల్చుని పనిచేసేందుకు అలవాటు పడండి. టీవీలో రెండున్నరగంటలసేపు సినిమా చూస్తుంటే కనీసం ఓ అర్ధగంటైనా నిల్చోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments