భోజన సమయంలో పిల్లలను తిడుతున్నారా...?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (12:19 IST)
కొంతమంది ఆవేశాన్ని అణచుకోలేక అన్నం కంచాన్ని విసిరికొడుతూ వుంటారు. జీవితంలో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో.. కోపంతో విసిరి కొడతారో అది వారికి దూరమవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.
 
పిల్లలైనా.. యువకులైనా తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే.. వాళ్లు భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలించడం జరుగుతుంటుంది. ఆ మాటలను భరిస్తూనే బాధపడుతూనే వాళ్లు భోజనం చేస్తారు. ఇలా ఆవేదనని అణచుకుంటూ చేసిన భోజనం వంటబట్టకపోగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెస్తుందని పండితులు సూచిస్తున్నారు. 
 
ఎలాంటి పర్వదినం కాకుండా అలా అందరూ కోపంతో కటిక ఉపవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న వారిపై ఆవేశ పడడం వలన శాస్త్ర సంబంధమైన దోషాలతో పాటు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ వుంటాయి. అందువలన భోజన సమయంలో సాధ్యమైనంత వరకూ కోపతాపాలకు పోకుండా ఉండడమే అన్నివిధాలా మంచిదని చెప్పవచ్చు.
 
భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా చేసినప్పుడే వంటబడుతుంది. అందుకే హడావిడిపడకుండా ... మాట్లాడకుండా భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో దారుణం - నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్ (వీడియో)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన దేవేంద్ర ఫడ్నవీస్ (video)

వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు

బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి

పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసేసిన భర్త.. ఈ గొడవ అంతటితో ఆగలేదు..

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?

13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

తర్వాతి కథనం
Show comments