Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోళిక అనే రాక్షసి అలా చచ్చింది.. అందుకే హోళీ పండుగ వచ్చిందా?

హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమకు చిహ్నంగా కొనియాడుతారు. బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఉత్

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:32 IST)
హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమకు చిహ్నంగా కొనియాడుతారు. బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఉత్తరాదిన అట్టహాసంగా జరుపుకుంటారు. దక్షిణాదిన ఈ పండుగను జరుపుకునే వారి సంఖ్య ఈ మధ్య బాగానే పెరిగిపోతుంది.
 
భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపికలతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగను ప్రసిద్ధి చెందేలా చేశాడని విశ్వాసం. హోళీకి ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోళిక దహన్ (హోళికను కాల్చడం) లేదా చోటీ హోళి (చిన్న హోళి) అని అంటారు. హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుని మంటల్లో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోళిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో హోళిక దహన్‌ను కామ దహనం అని అంటారు. 
 
హోలిక అను రాక్షసి అనే రాక్షసి రోజుకు ఒక చంటిబిడ్డను తింటూ, ఒక గ్రామవాసులందరికి గర్భశోకాన్ని కలిగించేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసరి మనువడి వంతు వచ్చిందట. అది గమనించిన ఆ వృద్ధురాలు హోళిక రాక్షసి నుంచి మనుమడిని తప్పించుకునేందుకు, ఆ గ్రామస్తుల గర్భశోక బాధను నివారించుటకై ఆ మహిమాన్వితుడైన మహర్షిని వేడుకొంటుంది. 
 
అందుకు ఆ రుషి తల్లీ.. ఆ రాక్షసి ఒక శాపగ్రస్తురాలు, ఎవరైనా ఆ రాక్షసిని నోటికిరాని దుర్భాషలతో తిడితే దానికి వెంటనే ఆయుక్షీణమై మరణిస్తుందని చెబుతాడు. అందుకోసం గ్రామస్తులను పోగుచేసి ఆ విధంగా దుర్భాషలాడమని తరుణోపాయం చెప్పినాడు. దానితో ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో గ్రామంలోనికి వెళ్లి రుషి తరుణోపాయం గ్రామస్తులకు చెబుతుంది. ఆ మరుసటి రోడు ఆ గ్రామస్తులందరిచేత ఆ ముదుసలి ఆ రాక్షసిని అనరాని మాటలనిపిస్తుంది. 
 
ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత హోళి రాక్షసి కుప్పకూలి మరణిస్తుంది. దానితో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగు చేసి ఆ చితిమంటలో హోళిరాక్షసిని కాల్చివేచి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. నాటి నుంచే హోళం పండుగ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా హోళి పండుగ రోజు పితృదేవతలను పూజల ద్వారా సంతృప్తిపరిచి... తర్పణాలు సమర్పిస్తే వంశాభివృద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

తర్వాతి కథనం
Show comments