Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవస

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (11:55 IST)
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని తవ్వారు. ఈ విషయాని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. 
 
జమ్మూ-కాశ్మీరులోని ఆర్నియా సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల్లో దాదాపు 14-15 అడుగుల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్ఎస్ సెక్టర్‌లోని ఆర్నియా సబ్‌ సెక్టర్‌లో డమల నలా వద్ద అటవీ ప్రాంతంలో ఈ సొరంగం కనిపించిందన్నారు. దీనిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామననారు. 
 
అయితే, వీరు నిర్మాణ కార్మికులా? ఉగ్రవాదులా? అనే అంశం ఇంకా నిర్థారణ కాలేదన్నారు. వారిపై జవాన్లు కాల్పులు జరపడంతో పాకిస్థాన్‌లోకి పరారయ్యారని తెలిపారు. ఈ సొరంగంలో ఉన్న ఆయుధాలు, ఆహార పదార్థాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయుధాలు, ఆహార పదార్థాలను పట్టుకుని ఉగ్రవాదులు పాకుతూ వెళ్ళడానికి అనువుగా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments