నేపాల్‌లో భారీ వర్షాలు : కొండచరియలు విరిగిపడి 16మంది మృతి

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (12:02 IST)
నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో కనీసం 16 మంది మరణించారు. ఆరు జిల్లాల పరిధిలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశీ పౌరులు సహా 16 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా నివేదికలు అందుబాటులో లేవని పేర్కొంది. 
 
ప్రస్తుతం ప్రభుత్వం రక్షణ, బాధితులకు సామగ్రి అందించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పింది. గత ఆదివారం నుంచి వరదలు, కొండచరియలు విరిగినపడ్డ ఘటనలో ఇప్పటి వరకు 16 మరణాలు నమోదయ్యాయని, 22 మంది గల్లంతయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. 
 
సింధుపాల్‌చోక్‌, మనంగ్‌ జిల్లాల్లో నివాస గృహాలకు భారీగా నష్టం జరిగింది. శనివారం ఉదయం వరకు సింధుపాల్‌ చోక్‌ జిల్లాతో పాటు లామ్‌జంగ్‌, మయాగ్డి, ముస్తాంగ్‌, మనంగ్‌, పాల్పా, కాలికోట్‌, జుమ్లా, దైలేఖ్‌, జజురా, బజాంగ్‌లో వరదలు రాగా.. కొండచరియలు విరిగిపడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments