Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మరో వైరస్‌ తోడైంది... ఏడుగురు మృతి.. అచ్చంగా కోవిడ్ లాగానే..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:22 IST)
కరోనాకు మరో వైరస్‌ తోడైంది. సివియర్ ఫీవర్ విత్ త్రామ్ బోసిటోపెనియా సిండ్రోమ్ (ఎస్ఎఫ్‌టీఎస్) అని ఈ వైరస్‌ని పిలుస్తారు. ఇది కూడా చైనాలోనే పుట్టింది. అప్పుడే ఈ వైరస్ బారిన 60మంది పడ్డారని, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. దీని లక్షణాలు కూడా అచ్చంగా కరోనా లక్షణాల మాదిరిగానే ఉన్నాయి. 
 
విపరీతంగా దగ్గు, జ్వరం వస్తాయి. అయితే.. ఇదేం కొత్త వైరస్ కాదు.. ఇంతకు ముందే 2010లోనే చైనాలో కనిపించిందని కూల్‌గా చెప్తోంది. ఆ తర్వాత జపాన్, కొరియాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో 37 కేసులు వెలుగు చూశాయి. 
 
పదేళ్ల తరువాత మళ్లీ వెలుగు చూసిన ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మనుషుల రక్తం, శ్లేషం ద్వారా వ్యాపించే అవకాశం ఉందని ఝెజియాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు షెంగ్ జిఫాంగ్ పేర్కొన్నారు.
 
ఇది కూడా మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని నిర్ధారించారు. అయితే జాగ్రత్తలు తీసుకున్నంత కాలం దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments