Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల కోసం ఉగ్రవాదులను వదిలిపెట్టిన నైజీరియా

బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది

Webdunia
ఆదివారం, 7 మే 2017 (14:34 IST)
బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది పాఠశాల విద్యార్థినుల్లో 82 మంది విడిచిపెట్టారు. మిగిలిన వారిని కూడా విడిపించేందుకు నైజీరియా సర్కారు చర్యలు చేపట్టింది. 
 
దాదాపు మూడేళ్ల క్రితం చిబుక్‌లోని పాఠశాలపై దాడి చేసిన బోకోహరామ్ ఉగ్రవాదులు 200 మందికి పైగా అమ్మాయిలను అపహరించుకుపోగా, ఆపై అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో 21 మందిని విడిచిపెట్టగా, ఇపుడు మరో 82 మందిని వదిలిపెట్టారు. ఆపై ఉగ్రవాదులతో నైజీరియా ప్రభుత్వం నెలల తరబడి చర్చలు జరిపింది. తాము జరిపిన చర్చలు ఇప్పటికి ఫలవంతం అయ్యాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
 
తమ సెక్యూరిటీ అధికారులకు ఉగ్రవాదులు అమ్మాయిలను అప్పగించారని తెలిపారు. వీరిని అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్వయంగా కలుస్తారని తెలిపారు. వీరందరూ ప్రస్తుతం సైన్యం అధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. బందీలుగా ఉన్న మిగతా వారిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తాము విడిచిపెట్టిన ఉగ్రవాదుల వివరాలను మాత్రం నైజీరియా ప్రభుత్వం వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం