Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐకమత్యంతో ప్రాణాలు కాపాడుకున్న చిరుత పులులు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (21:15 IST)
cheetahs
ఐకమత్యమే మహాబలం అనేందుకు అనేక కథలు వాడుకలో వున్నాయి. తాజాగా ఐక్యమత్యంతో ఎలాంటి శత్రువునైనా అంతమొందించవచ్చు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. కెన్యా దేశంలోని మాసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వు ఫారెస్ట్‌లో ఇప్పుడు కుండపోత వాన కురుస్తోంది.
 
దీంతో ఈ వానలకు తాలేక్‌ నది తీవ్రంగా ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉగ్రరూపం దాల్చిందనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో ఒడ్డుకు ఇటు వైపు ఉన్న ఐదు చిరుత పులలు ఎలాగైనా సరే నదిని దాటేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాయి. 
 
కానీ ధైర్యం చాలక అటూ ఇటూ తిరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆ నదిని దాటాలనుకుంటే వరద ఏ క్షణంలో మింగేస్తుందో తెలియదు.
 
పైగా ఇప్పడు నది తీవ్రంగా ప్రవహించడంతో ఆ చిరుతలు భయపడిపోతున్నాయి. ఇంకోవైపు ఆ నదిలోని భయంకరమైన మొసళ్లు కూడా ప్రాణాలు తీసేందుకు రెడీగా ఉంటాయి. ఈ కారణంగా ఎలాగైనా నదిని దాటాలి అనుకుని ఒకేసారి భయం వీడి ఒక్కటిగా దూకాయి. 
 
ఇంకేముంది ఐకమత్యంగా ఉండటంతో వరద భయం వాటిని ఏమీ చేయలేదు. మొసళ్లు కూడా వాటి దగ్గరకు రాలేదు. ఇలా కలిసికట్టుగా ఆ చిరుతలు అన్నీ కూడా ఆ నదిని దాటాయి. క్షేమంగా తమ రాజ్యానికి చేరుకున్నాయి. ఈ చిరుతలు ఐకమత్యంగా ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments