Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సరిహద్దు తలనొప్పి : రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచిన చైనా

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (13:11 IST)
ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. చైనా బలగాలు హద్దుమీరుతుంటే.. వాటిని భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా తన రక్షణ బడ్జెట్​ను భారీగా పెంచింది. ఈ ఏడాది 209 బిలియన్​ డాలర్లు రక్షణ శాఖకు కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం ఎక్కువ. 
 
రక్షణ బడ్జెట్​ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా‌.. ఈ సంవత్సరం రక్షణ రంగానికి 209 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు నేషనల్​ పీపుల్స్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​పీసీ) పార్లమెంట్​లో ప్రకటించింది. ఇది భారత రక్షణ బడ్జెట్‌కు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. 
 
ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం అధికంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టడానికి కాదని.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికేనని చైనా స్పష్టం చేసింది. శాంతియుత అభివృద్ధి, భద్రతా విధానాలకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపింది .ఒక దేశం ఇతరులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనేది.. ఆ దేశ రక్షణ విధానంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments