Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పైన దాడికి సపోర్ట్ కావాలి ప్లీజ్... డ్రాగన్‌కి ఫోన్ చేసిన పాక్...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:47 IST)
భారత్ వైమానిక దాడులతో పాకిస్థాన్‌కి కునుకు లేకుండా చేసినట్లుంది. ఇవాళ ఉదయం జరిగిన యుద్ధ విమానాల దాడులతో పాక్ వణికిపోయింది. అలెర్ట్ అయిన పాకిస్థాన్ తనకు అత్యంత సన్నిహిత స్నేహబంధాన్ని కలిగి ఉన్న డ్రాగన్ దేశానికి ఫోన్ చేసి సాయం అందించవలసిందిగా కోరింది. భారత వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కి వెళ్లిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ వీకి ఫోన్ చేసారు. 
 
ఇదే విషయాన్ని చైనా ప్రభుత్వరంగ అధికారిక వార్తా సంస్థ క్సిన్హువా స్వయంగా వెల్లడించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్‌లోకి ప్రవేశించిందని ఖురేషి చైనాకు ఫిర్యాదు చేసారు. భారత్‌పై తిరిగి దాడులు చేసేందుకు సహకరించాలని కోరితే, చైనా అందుకు అంగీకరించలేదని సమాచారం. 
 
భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్‌ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు వాటికి దీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆ దేశ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఉదయాన్నే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. భారత్ చేస్తున్న దాడులతో మొత్తమ్మీద పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments